విధాత, వరంగల్ ప్రతినిధి: ఏసీబీ అధికారులమంటూ వరంగల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు రూ. 10 లక్షల 20 వేల రూపాయలు టోకరా వేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాము ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరించడంతో ఆ అధికారి భయపడి దశలవారీగా డబ్బులు దుండగుని అకౌంట్ కు పంపించారు. తర్వాత తాము మోసపోయానని గమనించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ముందు ఏసీబీ అధికారి సాంబయ్యకు ఫోన్ చేసి తమను కొందరు వ్యక్తులు బెదిరించారని వివరించడంతో ఈ సంఘటనతో ఏసీబీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆర్టీవో అధికారి పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆర్టిఏ శాఖలో జరుగుతున్న అవినీతి దీనికి మూల కారణమని చర్చ సాగుతుంది.
Fake ACB Officers Cheat RTA official : ఏసీబీ అధికారులమంటూ 10 లక్షలు వసూలు
తాము ఏసీబీ అధికారులమంటూ వరంగల్కు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) జైపాల్ రెడ్డిని కొందరు వ్యక్తులు బెదిరించి, దశలవారీగా రూ. 10.20 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన ఎంవీఐ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన కలకలం రేపింది.

Latest News
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు
స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
హామీలు అమలుచేయకుంటే తిరుగుబాటు తప్పదు : కాంగ్రెస్ సర్కారుకు సీపీఐ నేత కూనంనేని హెచ్చరిక
ఇంజెక్షన్లకు ఇక గుడ్బై? మధుమేహం చికిత్సకు కొత్త ఔషధంతో కొత్త ఆశలు
కేటీఆర్ చూడండి.. కేసీఆర్ దోస్తు ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి