హుస్సేన్ సాగర్ లో గ‌ణేష్ నిమ‌ర్జ‌నానికి సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్

విధాత‌: హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హై కోర్ట్ ఆర్డర్ వచ్చిందని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, సోలిసిటర్ జనరల్ […]

హుస్సేన్ సాగర్ లో గ‌ణేష్ నిమ‌ర్జ‌నానికి సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్

విధాత‌: హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

పిటిషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హై కోర్ట్ ఆర్డర్ వచ్చిందని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.వగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయి,అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయి. ఇది ప్రతి సంవత్సరం వస్తున్న ఇబ్బందన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

వచ్చే ఏడాది ఈ ఆర్డర్ ను అమలు చేస్తామని తెలిపిన తుషార్ మెహతా.ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్ లు ఏర్పాటు చేసాం.కాలుష్యం జరగకుండా వెంట.. వెంటనే విగ్రహాలను తరలించడం జరుగుతుంది.హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు నాకు తెలుసన్న సీజేఐ.హుస్సేన్ సాగర్ పరిశుభ్ర పరిచేందుకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారు.ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృధా అవ్వడం లేదా అని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేసాం.. కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది.రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్ట్.