విధాత:తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ KRMB ఛైర్మన్ కు లేఖ రాశారు.శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని,బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కె సి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలి. నీటి కేటాయింపులు లేని HNSS ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతలను వెంటనే ఆపివేయాలి. సుంకేశుల బ్యారేజి ద్వారా కె సి కాలువకు 39.90 TMC ల నీటి కేటాయింపులు ఉండాగా ప్రతీఏటా సరాసరి 54 TMC ల తుంగభద్ర జలాలు తరలిస్తునారు. RDS కు 15.90 TMC కేటాయింపులు ఉండగా సరాసరి 5 TMCలకు మించి తరలించడం సాధ్యం కావడంలేదు. తుంగభద్ర జలాలకు అదనంగా కె సి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమం.ఆంధ్రప్రదే రాష్ట్రం కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 TMC లు మాత్రమే తరలించాలి. కానీ ఈ తరహా కేటాయింపులు లేని అక్రమ లిఫ్ట్ ల ద్వారా తన పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నది. కావున ట్రిబ్యున ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్ ల ద్వారా నీటి కేటాయింపులను KRMB నిరోధించాలని లేఖలో పేర్కొన్నారు.