తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ సాంకేతిక సమస్యలు ఎదురైతే 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్నందున ఈ నె 23 లేదా 24న ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా, నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియ చాలా వరకు పూర్తయినట్లు సమాచారం. మార్చి 10వ తేదీన మూల్యాంకన ప్రారంభం కాగా, మొత్తం నాలుగు విడుతల్లో పూర్తి చేశారు. ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.