వరంగల్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తే అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు
విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తే అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ లో గురువారం వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో తాజాగా సమావేశాన్ని మంత్రులు ఇలా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదించనున్న ప్రణాళికలు, సమస్యలపై చర్చించారు.
వరంగల్ నగరం చుట్టూ నిర్మించనున్న ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) భూసేకరణ, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అలైన్మెంట్, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కుడా మాస్టర్ ప్లాన్, జిడబ్ల్యుఎంసి పరిధిలో ప్రధాన నాళాల రిటైనింగ్ వాల్ ల నిర్మాణం, వరద నివారణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మాణం, కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు తదితర అంశాల పై చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, ఎంఎయుడి ప్రిన్సిపాల్ సెక్రెటరీ దానా కిషోర్, సీడీఎంఏ విపి గౌతమ్, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రెటరీ హరిచందన, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్ లు డాక్టర్ సత్య శారదా, పి. ప్రావీణ్య, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.