విధాత, హైదరాబాద్ : డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు జులై 28వ తేదీకి వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పది మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు.. నోటిఫికేషన్ కు పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ఇచ్చారని, ఈ నాలుగు నెలల వ్యవధిలో ఇతర అనేక పరీక్షలు రాశారన్నారు. సమయాభావం వల్ల పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారని తెలిపారు. ఇక ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పది మంది కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు డీఎస్సీకి తగిన సమయం ఉందన్నారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారని కోర్టుకు వివరించారు. పిటిషన్ వేసిన పది మంది డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేశారా అని కోర్టు ప్రశ్నించింది. గ్రూప్ -1 తో పాటు డీఏవో, డీఎస్సీకి అప్లై చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాది వెల్లడించగా, పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఒకరు కూడా డీఎస్సీ హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా మరో వైపు డీఎస్సీ పరీక్షలు గరువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
DSC | హైకోర్టులో డీఎస్సీ పరీక్ష పిటిషన్ విచారణ 28కి వాయిదా
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు జులై 28వ తేదీకి వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పది మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Latest News
Moon | చందమామ సేఫ్.. గ్రహశకలం ఢీకొట్టే అవకాశం లేదని గుడ్న్యూస్ చెప్పిన నాసా
Floating Village | భారత్లోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామం.. దీని విశేషాలు తెలుసా!
ప్రీ ప్రైమరీ తరగతులు అన్ని స్కూళ్ళలో ప్రారంభించాలి.. బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి
గ్యాస్ బండ మోత వెనుక.. ఎంపీలు ఆ విషయంలో చూపిన నిర్లక్ష్యమే కారణమా?
కప్పల విషాన్ని తుడిచి మరీ తింటున్న పాములు! శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం.. వీడియో
ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు చిత్తు
ప్రాజెక్టుల భూ సేకరణకు రూ.5 వేల కోట్లు : మంత్రి ఉత్తమ్
త్వరలోనే కాలేజీ విద్యార్థినులకు స్కూటర్లు : సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
ఫాసిజం నేపథ్యంలో స్త్రీ విమోచనోద్యమం పై 105 ఏండ్ల క్రితం లెనిన్ దిశా నిర్దేశం నేటికీ మార్గదర్శకమే!
దేవాలయ తీర్థం రాగి పాత్రలో తులసి ఆకులు, పచ్చ కర్పూరం ఎందుకు?