రాష్ట్ర ప్రభుత్వం ఉస్మాని యూనివర్సిటీతో పాటు 10 వర్సిటీలకు వీసీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది
విధాత: రాష్ట్ర ప్రభుత్వం ఉస్మాని యూనివర్సిటీతో పాటు 10 వర్సిటీలకు వీసీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ నియామకానికి దరఖాస్తు చేసుకునే ప్రొఫెసర్లు ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు.
వీసీల నియామకం జరిగే యూనివర్సీటీలు ఇవే…
ఉస్మానియ యూనివర్సిటీ, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓ పెన్ యూనివర్సిటీ, జె ఎన్ టీయు, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్ లాల్ సెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ.