సాగర్‌లో పోస్టాఫీస్ ముందు బాధితుల ధర్నా

నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు

  • Publish Date - April 1, 2024 / 01:45 AM IST

విధాత : నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు రెండు కోట్ల నగదును స్వాహా చేశాడు. ఈ స్కామ్ నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి పోస్టల్ ఉన్నతాధికారులు ఖాతాదారుల సొమ్మును తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం నిరసనకు దిగారు. పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ వారు డిమాండ్ చేశారు

Latest News