హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు వై-ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
విధాత, హైదరాబాద్: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు వై-ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సున్నితమైన పాతబస్తీ ప్రాంతం కావడంతో కేంద్రం అభ్యర్థి భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది.
మాధవి లతకు 11 మందితో కూడిన వై-ప్లస్ భద్రత కల్పించింది. ఎంఐఎం కంచుకోటగా కొనసాగుతున్న హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీతో మాధవీలత తలపడుతుంది. ఈ నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తగా అభ్యర్థికి తగిన భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది.