విధాత:ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల రేపు (25–06–2021) పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు లోటస్పాండ్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, ఆ కుటుంబ ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని షర్మిల కార్యాలయం కోరింది.