తిరునామాలతో జన్మించిన ఆవు దూడ..శ్రీవారి మహిమగా వైరల్
చిత్తూరులో మూడు తిరునామాలతో పుట్టిన ఆవు దూడ.. గ్రామంలో వెంకన్న మహిమగా సంబరం, వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్.

అమరావతి : చిత్తూరు జిల్లాలో మూడు నామాలతో ఆవు దూడ జన్మించడం వైరల్ గా మారింది. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయితీ(యల్లంపల్లె) గ్రామంలో మూడు నామాలతో ఆవు దూడ జన్మించింది. అచ్చం తిరుమల తిరుపతి వెంకన్న తిరునామాల మాదిరిగా తలపై నామాలతో జ ఆవు దూడ జన్మించడం ఈ వెంకన్న మహిమగా గ్రామస్తులు భావిస్తున్నారు గ్రామస్తులు. కాగా వెంకన్నకు తాను మొక్కు చెల్లించాల్సిన సమయంలో యాదృచ్ఛికంగా మూడు నామాలతో దూడ జన్మించడంతో స్వామి మహిమగా రైతు సంబర పడుతున్నాడు.
పెద్దకంపల్లెకు చెందిన రైతు రవినాయుడు పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకింది. వ్యాధి నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆవులకు వ్యాధి నయమైనప్పటికీ పనుల ఒత్తిడిలో మొక్కు వాయిదా వేస్తూ వచ్చాడు. రెండు రోజుల క్రితం ఓ ఆవు ఒక పేయదూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు నుదుటిపై తెల్లరంగులో మూడు నామాలుండటం చూసి రైతు రవినాయుడు కుటుంబం ఆశ్చర్యానికి లోనైంది.
వెంకన్న మూడు నామాలతో దూడ జన్మించడంతో ఆ స్వామి నా మొక్కును గుర్తు చేశాడని రైతు రవినాయుడు చెబుతున్నాడు. దీంతో గతంలో గోశాలకు ఇద్దామనుకున్న దూడతో పాటు నామాలతో పుట్టిన దూడను కూడా టీటీడీకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం విశేషం.