తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య పెరిగిపోతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు బాగా సంచరిస్తున్నాయి. ఎక్కడి పడితే అక్కడ దర్శనమిస్తూ.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి పెద్ద పులులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మాచర్ల - ఎర్రగొండపాలెం రహదారిలో ఓ పెద్ద పులి కనిపించింది. అర్ధరాత్రి వేళ.. భయంకరమైన గాండ్రింపులు చేస్తూ పులి రోడ్డుపై కనిపించింది. ఈ దృశ్యాన్ని వాహనదారులు తమ మొబైల్స్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.