తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు
విధాత: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే సీఎం జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ. 4వేలను ఏప్రిల్ నుంచే కలిపి అందిస్తామని బాబు వెల్లడించారు. ‘తల్లికి వందనం కింద ప్రతి మహిళకు రూ.15వేలు, ఉచితంగా మూడు సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ హామీలు అమలు చేస్తామని పాయకరావుపేట సభలో చంద్రబాబు తెలిపారు.