విధాత: అనంతపురం జిల్లా, కదిరి ప్రభుత్వాస్పత్రిలో కరోనా వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తనకల్లు మండలం, డి.చెక్కవారిపల్లి కి చెందిన నరసింహులు, కదిరి మున్సిపల్ పరిధిలోని కుమ్మర వాండ్ల పల్లి కి చెందిన ఆదిలక్ష్మమ్మ అనే ఇరువురు మృతి చెందిన విషయం తెలిసిందే.
గురువారం మరో నలుగురు మృత్యువాతపడ్డారు. నాగిరెడ్డిపల్లికి చెందిన గౌరమ్మ, ఒడి చెరువు మండలం రామిరెడ్డి పల్లి కి చెందిన విమల, ఎన్ పి కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను కు చెందిన 8 ఏళ్ల చిన్నారి రామానంద్ రెడ్డి, తలుపుల మండలం బురుజుపల్లి కి చెందిన రామసుబ్బమ్మ ఉన్నారు. మరో ఐదారుగురు పరిస్థితి విషమంగా ఉంది. కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి కదిరి ప్రభుత్వాసుపత్రికి సందర్శించి కోవిడ్ బాధితులతో నేరుగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీవో వెంకట్ రెడ్డి ఉన్నారు.