సంపూర్ణ లాక్‌డౌన్ దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం..!

విధాత‌: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్న‌ట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. కానీ దీని వల్ల లాభం లేదని అధికారులు చెప్తున్నారు. మరో వైపు పాజిటివిటి రేటు […]

  • Publish Date - May 14, 2021 / 08:55 AM IST

విధాత‌: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్న‌ట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. కానీ దీని వల్ల లాభం లేదని అధికారులు చెప్తున్నారు. మరో వైపు పాజిటివిటి రేటు 10 శాతం దాటితే ఆ జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. కానీ ఏపీలో పాజిటివిటి రేటు 20 శాతం దాటుతోంది.

విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్పా మరో మార్గం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కు అధికారులు దీనిని సూచించినట్టు సమాచారం. మే 20న అసెంబ్లీ సమావేశం ఐతే ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఉండడంతో అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఏ క్షణమైనా ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.