జగన్ ఆముల్ బేబీ అయితే…లోకేష్ నువ్వు హెరిటేజ్ దున్నపోతువా…?
విధాత:తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయి ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పూర్తి అయితే సీఎంకు, వైఎస్సార్ కి మంచి పేరు వస్తుందని వారి భయం అందుకే రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కోవిడ్ పరిస్థితుల్లో చాలా మంది పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు చనిపోయారు. చినబాబు ఫ్రస్టేషన్ […]

విధాత:తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయి ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పూర్తి అయితే సీఎంకు, వైఎస్సార్ కి మంచి పేరు వస్తుందని వారి భయం అందుకే రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కోవిడ్ పరిస్థితుల్లో చాలా మంది పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు చనిపోయారు.
చినబాబు ఫ్రస్టేషన్ పీక్స్ కి వెళుతోంది మూడు శాఖలకు మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు ఉన్న ఎమ్మెల్సీ కూడా ఓ ఏడాదిలో పూర్తి అయిపోతుంది అందుకే బయట తిరగలేక ఇంట్లో కూర్చుని జూమ్ లో జగన్ గురించి మాట్లాడుతున్నాడు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు ఒక్క శాతమైనా ఉందా మా తాత సీఎం, మా నాన్న సీఎం అని చెప్పుకున్నా నువ్వు గెలవలేక పోయావ్,కనుచూపు మేరలో నీ పార్టీ జగన్ సంక్షేమ పథకాలతో కొట్టుకుపోయే పరిస్థితి జగన్ ఆముల్ బేబీ అయితే…నువ్వు హెరిటేజ్ దున్నపోతువా…? మాటలు నీకే కాదు…మాకు వచ్చు.. గూగుల్ కొడితే నీ పేరు పప్పు అని వచ్చింది.
నువ్వు గడ్డం పెంచగానే ఎదో జరగదు..ధైర్యం బై బర్త్ బ్లడ్ లో ఉండాలి ఆత్మగౌరవం లేక హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నావ్,ఏ మాత్రం ఆంధ్ర ప్రజలపై ప్రేమ ఉన్నా గత ఐదేళ్లలో ఏపీలో ఇల్లు కట్టుకునే వాడివి.
పునరావాసం విషయములో అన్ని చర్యలు తీసుకుంటున్నాము,2022 ఖరీఫ్ నాటికీ తప్పనిసరిగా సాగునీరు అందిస్తాం,స్పిల్ వే పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్ ఎలా కడతారు.వీళ్ళు చేసిన తప్పులను మాపై రుద్దాలని చూస్తున్నారు,సీఎం పోలవరం కోసం రావాల్సిన నిధుల విషయంపై ఢిల్లీలో చర్చిస్తారు అని అన్నారు.