మీడియాపై రాజద్రోహం కేసులా?.. కిష‌న్‌రెడ్డి

విధాత‌(హైద‌రాబాద్‌): దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలు మినహా ఇతర రాజకీయ కారణాలతో మీడియాపై రాజద్రోహం కేసు మోపడం ఆమోదయోగ్యం కాద‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలపై కేసు బనాయించ‌డంపై ఆయ‌న స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాద‌న్నారు. ఏపీలో మీడియా సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న అంశాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దృష్టికి తీసుకు వెళ్తాన‌ని చెప్పారు. కేంద్ర […]

  • Publish Date - May 15, 2021 / 10:19 AM IST

విధాత‌(హైద‌రాబాద్‌): దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలు మినహా ఇతర రాజకీయ కారణాలతో మీడియాపై రాజద్రోహం కేసు మోపడం ఆమోదయోగ్యం కాద‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలపై కేసు బనాయించ‌డంపై ఆయ‌న స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాద‌న్నారు.

ఏపీలో మీడియా సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న అంశాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దృష్టికి తీసుకు వెళ్తాన‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై అనేక మీడియా సంస్థలు తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఏనాడు వారిపై ఆంక్షలు విధించలేద‌ని గుర్తు చేశారు. ఇప్పటివరకూ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీడియా సంస్థ పై నిషేధం విధించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టారన్న వార్తలపై సంబంధిత శాఖ తో చర్చిస్తాన‌ని కిష‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

Latest News