అమరావతి : ఐఏఎస్ శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక అవినీతి అనకొండ అని, అవినీతితో వేల కోట్లు లూటీ చేసిందని ఆరోపించారు. ఆమె కట్టే చీర ఖరీదు ఎంత? ఆమెకు వచ్చే జీతం ఎంత? అని…శ్రీలక్ష్మి ధరించే చీర ఖరీదు రూ.లక్షన్నర అని విమర్శించారు. ఒక్కోటి 50లక్షలకు పైగా విగ్గులు ఆమె వద్ద ఉన్నాయని ఒక్కో రోజు ఒక్కో విగ్గుతో కనిపిస్తారన్నారు. టీడీఆర్ బాండ్ల స్కాంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని..ఆమె టీడీపీ నేతలతో కలిసి రూ.వందల కోట్లు దోచుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీబీఆర్ బాండ్ల వివాదంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. శ్రీలక్ష్మీ రాష్ట్రంలోని మంత్రులందరినీ పూచికపుల్లలా చూసేవారని… తన శాఖ మంత్రులను సైతం లెక్కచేయలేదన్నారు. డబ్బు సంపాదించడమే తప్ప.. ఏ నైతిక విలువలూ లేని మనిషి అని… ఒక్క మాటలో చెప్పాలంటే ఓ పూతన, లంకిణి.. తాటకిలా కింది అధికారుల పట్ల ఆమె వ్యవహరించారు’’ అని భూమన తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో మా హయాంలో రోడ్లు వేసే క్రమంలో నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ముసుగులో టీబీఆర్ బాండ్ల స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు. ఆధునిక రజీయా సుల్తాన్ ఇప్పుడు తమపై దుష్ఫ్రచారం చేసే కుట్రలో భాగస్వామిగా మారిందన్నారు. సుప్రీంకోర్టుకు సైతం శ్రీలక్ష్మి అవినీతి గూర్చి తెలుసన్నారు.
ఆమె ఒక అవినీతి అనకొండ: ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
టీడీపీ బాండ్ల స్కామ్ లో శ్రీలక్ష్మి పాత్రపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

Latest News
పక్కవారికి స్క్రీన్ కనబడదు: ప్రైవసీ డిస్ప్లేతో సామ్సంగ్ గెలాక్సీ ఎస్26 సంచలనం
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం స్థానిక హక్కు.. ప్రారంభోత్సవానికి ముందు స్థానికుల డిమాండ్
robots performing kung fu moves | కుంగ్ఫూతో అదరగొట్టిన రోబోలు.. ఆకట్టుకుంటున్న వీడియో
నగరంలో ఏనుగు విధ్వంసం !
డీఎంకే గూటికి చేరిన తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్
మావోయిస్టు అగ్రనేతలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
‘స్వర్గం’ ఎక్కడుందో ‘లొకేషన్’ చెప్పేశాడు...
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్వీస్టు..హైకోర్టులో సీబీఐ అప్పీల్
చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ కన్నుమూత
కోల్కతాను వణికించిన భూకంపం..జనం పరుగులు