కోవిడ్ అనాధ మృతదేహాలకు భూమన అంతిమ సంస్కారాలు

విధాత‌(తిరుపతి): కోవిడ్ బారిన ప‌డి చనిపోయిన అనాధ‌ పార్థివ దేహాల‌కు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అంతా తానై అంతిమ సంస్కారాలు జరిపారు. రుయా మార్చురీలో కోవిడ్ మరణాల వల్ల చనిపోయిన 21 మందికి బుధవారం సాంప్రదాయ రీతిలో పూలమాలలు వేసి స్వయంగా మహా ప్రస్థానం, ముస్లిమ్ జెయిసి వాహనాల్లో పార్థివ దేహాలు వుంచి ఖననం కోసం తరలించారు. తిరుపతి శాసన సభ్యులు మాట్లాడుతూ నిన్నటి వరకు అత్యంత ఆత్మీయులుగా మనతో , మన […]

  • Publish Date - May 5, 2021 / 11:01 AM IST

విధాత‌(తిరుపతి): కోవిడ్ బారిన ప‌డి చనిపోయిన అనాధ‌ పార్థివ దేహాల‌కు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అంతా తానై అంతిమ సంస్కారాలు జరిపారు.

రుయా మార్చురీలో కోవిడ్ మరణాల వల్ల చనిపోయిన 21 మందికి బుధవారం సాంప్రదాయ రీతిలో పూలమాలలు వేసి స్వయంగా మహా ప్రస్థానం, ముస్లిమ్ జెయిసి వాహనాల్లో పార్థివ దేహాలు వుంచి ఖననం కోసం తరలించారు. తిరుపతి శాసన సభ్యులు మాట్లాడుతూ నిన్నటి వరకు అత్యంత ఆత్మీయులుగా మనతో , మన మధ్య తిరిగి వారు కరోనా కారణంగా చనిపోయిన వారిని మానవత్వం లేకుండా వదలి వెళ్లి వెళ్ళేవారు, మరి కొంతమంది కుటుంబం అంతా కరోనా భారిన పడి అంతిమ సంస్కారాలు నోచుకోలేకపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసేరు. గత సంవత్సరం నాతోటి మిత్రులు, సహచరులు ముస్లిమ్ జే ఎ సి గా ఏర్పడి 501 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారని తెలిపారు.

కార్యక్రమంలో ముస్లిమ్ జె ఎస్ ఇ సి ఇమామ్ , ప్రభుత్వ మహాప్రస్థానం వాహనాలో పార్థివ దేహాలను తరలించగా, కార్పొరేటర్లు వెంకటేష్, నరేంద్ర, ఎస్.కె.బాబు, రుయా డెవెలప్ మెంట్ కమిటీ, వర్కింగ్ చైర్మన్ చంద్రశేఖర్, సూపరింటెండ్ంట్ డా. భారతి , పోలీసులు హాజరయ్యారు.

Latest News