పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
విధాత: రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సంక్షేమ పథకాలకు రూ.64వేల కోట్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది… సంక్షేమ పథకాల కంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం కాదా? అని సోము […]

విధాత: రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సంక్షేమ పథకాలకు రూ.64వేల కోట్లు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది… సంక్షేమ పథకాల కంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం కాదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.