విధాత : కేంద్ర క్యాబినెట్ సమావేశం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సెమీ కండక్టర్ ప్రాజెక్టు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ, ఒడిశా, పంజాబ్లో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రూ.4594 కోట్లతో ఈ సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తాజాగా ఆమోదం తెలిపిన సెమీ కండక్టర్ ప్రాజెక్టులు కలిపితే వీటి సంఖ్య పదికి చేరుకుంటాయి. 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి దోహదం చేయనున్నాయి. ఆరు రాష్ట్రాల్లో రూ. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులు వీటి ద్వారా రానున్నాయి. ఇవాళ ఆమోదం తెలిపిన సెమీ కండక్టర్ ప్రాజెక్టుల ద్వారా 2,034 స్కిల్డ్ ప్రొఫెషనల్స్కు ఉపాధి లభిస్తోంది. మరో వైపు ఈ ప్రాజెక్టులపై పరోక్షంగా వందలాది మందికి జాబ్స్ వస్తాయని కేంద్ర మంత్రి చెప్పారు. అడ్వాన్స్ డ్ సిస్టం ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ఎఎస్ఐపీ ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ లో 700 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. లఖ్నవూ మెట్రో ఫేజ్ 1 బీకి కూడా క్యాబినెట్ అంగీకరించింది. క్లీన్ ఎనర్జీ కోసం టాటో-2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా ఉత్పత్తి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు కోసం రూ. 18,500 కోట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో సెమీ కండక్టర్ల యూనిట్..కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర క్యాబినెట్ సమావేశం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సెమీ కండక్టర్ ప్రాజెక్టు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు