Site icon vidhaatha

CM Jagan | మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్ ధీమా

22 ఎంపీ సీట్లు గెలుస్తామని ప్రకటన

విధాత: ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వబోతుందని, ప్రశాంత్ కిషోర్ ఉహించలేనంతగా సీట్లు రాబోతున్నాయని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై జగన్ తొలిసారిగా స్పందించారు. గురువారం ఐ ప్యాక్ సంస్థ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీలో వైసీపీ 22 ఎంపీ సీట్లు గెలవబోతుందని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2019కంటే ఎక్కువ సీట్లు ఈసారి వైసీపీ సాధించబోతుందన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత ఎక్కువగా మేలు చేద్దామని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందన్నారు. ఐ ప్యాక్ ప్రతినిధుల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Exit mobile version