రాజకీయాల్లో తనదైన శైలీలో సాగిపోతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని వైరటీగా ముందుకు తీసుకెలుతున్నారు.
విధాత, హైదరాబాద్ : రాజకీయాల్లో తనదైన శైలీలో సాగిపోతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని వైరటీగా ముందుకు తీసుకెలుతున్నారు. ఆటోలు ఎక్కి…రోడ్డు పక్కన అల్పాహారాలు చేస్తూ ఓటర్లను కలుస్తున్న పాల్ మత్స్యకారుడి వేషంలో తీరంలో జాలర్ల కుటుంబాలను ఓట్లు అభ్యర్ధించారు. తాజాగా తాటి ముంజలు కొట్టి ఎన్నికల ప్రచారం సాగించారు. తాను ఎప్పుడు తాటి చెట్టి ఎక్కలేదని..ముంజలు కొట్టలేదని, అయినా ఒక్క సెకన్లో కొట్టానన్నారు. ఏ పనైనా మనకు సాధ్యమన్నారు.
పల్లె నుంచి ప్రపంచానికి వెళ్లాను..మళ్లీ పల్లెకు ఎందుకు వచ్చానంటే రాష్ట్రాన్ని బాగు చేయడానికేనన్నారు. రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, వైసీపీలు రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు…కుటుంబానికి ఐదు కోట్ల అప్పు పెట్టారని, వారు చెప్పిన స్పెషల్ స్టేటస్ తెచ్చారా.. స్పెషల్ ప్యాకేజీ తెచ్చారా..స్మార్ట్ సీఇటీలు కట్టారా.. కంపనీలు పెట్టి ఉద్యోగాలిచ్చారా..కేవలం ఎన్నికల ముందు రెండువేలు ఇస్తారు తప్ప మీ బతుకులు మార్చే పనులు చేయరన్నారు. విశాఖ ఎంపీగా నా కుండ గుర్తుకు ఓటేసి రాష్ట్రాన్ని, మీమ్మల్ని అప్పుల నుంచి విముక్తి కల్పించుకోండని తెలిపారు. మీరు కుండను ఓట్లతో నింపితే నేను మీ జీవితాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని నింపుతానని తనదైన పంచ్మార్క్ డైలాగ్లతో అలరించారు.