వరుణయాగం చేసిన మంత్రి అప్పలరాజు
విధాత: శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలంటే జిల్లాలో, పలాస నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవాలని. పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందాలని కోరుతూ రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వాసుదేవుడికి పూజలు చేశారు. గురువారం మందస లోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో వరుణ యాగం చేపట్టారు. వేద పండితులతో పలాస నియోజకవర్గం నాయకులు, ప్రజలు రైతులతో కలిసి వరుణ యాగం నిర్వహించారు. ప్రస్తుత వర్షాభావ […]

విధాత: శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలంటే జిల్లాలో, పలాస నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవాలని. పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందాలని కోరుతూ రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వాసుదేవుడికి పూజలు చేశారు. గురువారం మందస లోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో వరుణ యాగం చేపట్టారు. వేద పండితులతో పలాస నియోజకవర్గం నాయకులు, ప్రజలు రైతులతో కలిసి వరుణ యాగం నిర్వహించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏమిచేయాలని వేద పండితుల సలహా మేరకు నియోజకవర్గం ప్రజల మేలు కోరి యగాలు, యజ్ఞాలు చేస్తే ఫలితం ఉంటుందని వేదపండితులు తెలియజేయడంతో గురువారం మందస వాసుదేవ ఆలయంలో యాగం చేపట్టారు. ఎంతో చరిత్రకల్గిన దేవాలయంలో ప్రకృతి సమతుల్యతను కోరుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు నీటి వరనరులు అందించేలా భగవంతుని సన్నిధిలో యాగం చేయడం ఎంతో శుభపరిణామం.
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజు మందస వాసుదేవ ఆలయ పండితులతో వరుణయాగాన్ని చేపట్టారు. జిల్లాలోని నాగావళి, వంశధార,బాహుదా నదులు ఉన్నాయి. వాటిపై రిజర్వాయర్లు కూడా ఉన్నాయని నదులలో నీటి ప్రవాహం పెరిగి సంబందిత రిజర్వాయర్ లలో నీటి నిలువలు పెరగాలని దేవుడ్ని కోరామని అన్నారు. పలాస నియోజకవర్గంలోని చెదువులు, మందస మండలం లోని కళింగదళ్, డబారుసింగి రిజృవాయర్లు కూడా నీటితో కలకల లాడాలని వరుణయాగం చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు వర్షాభావ ప్రమాదం నుండి గట్టెక్కి వర్షాలు విరివిగా కురవాలని కోరారు. వరణ యాగం పూర్తి అయ్యే లోగా మందస, పలాస ప్రాంతాల్లో వర్షం కురవడం చూస్తే మంత్రి ఏ సంకల్పంతో అయితే వరుణ యాగం చేపట్టారో ఆ సంకల్పం సిద్దించేందుకు భగవంతుడు, వరుణ దేవుడు వర్షం కురిపించడం ఎంతో ఆనందదాయకం. పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు మేలుకోరి యాగం చేసేందుకు వేద పండితులు, నియోజకవర్గం నాయకులు, ప్రజలు వరుణ యాగం కోసం మందస వాసుదేవుని ఆలయం వద్దకు భారీగా చేరుకోవడం ఏంతో సంతోషంగా ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని దేవుని ఆశిస్సులు ప్రజలపై ఉండాలని కోరుతూ శ్రీదేవి ,భూదేవి సమేత వాసుదేవు పెరుమాళ్ కు మొక్కలు చెల్లించారు. యాగ ఫలితం కూడా ప్రజలందరికి అందాలని సంకల్పం చేశారు.