విశాఖకు ఆక్సిజన్ ట్యాంకర్లు

విధాత‌(విశాఖపట్నం): ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, అత్యవసర ఔషధాలతో సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ నిన్న విశాఖపట్టణం చేరుకుంది. నౌక మోసుకొచ్చిన వాటిలో 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు. దేశంలో కరోనాతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం సముద్రసేతు-2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలివెళ్లాయి. అందులో […]

  • Publish Date - May 11, 2021 / 05:31 AM IST

విధాత‌(విశాఖపట్నం): ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, అత్యవసర ఔషధాలతో సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ నిన్న విశాఖపట్టణం చేరుకుంది. నౌక మోసుకొచ్చిన వాటిలో 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు.

దేశంలో కరోనాతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం సముద్రసేతు-2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలివెళ్లాయి. అందులో ఐరావత్ ఒకటి. వివిధ దేశాల నుంచి సేకరించిన ద్రవ ఆక్సిజన్, కొవిడ్ ఔషధాలను సేకరించి భారత్ కు తరలిస్తున్నారు.

Latest News