అనంత మహిళా రైతును ప్రశంసించిన ప్ర‌ధాని మోడీ

విధాత(అనంతపురం): మహిళా రైతు వన్నూరమ్మను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రశంసించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(2021 - 22) పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ప్ర‌ధాని మోడీ అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మ తో మాట్లాడారు. మహిళా రైతును, అనంతపురం జిల్లాను మోడీ మెచ్చుకున్నారు. దేశం మొత్తంలో 5,6 మందితో మాట్లాడితే అందులో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మను ఎంపిక చేసుకున్న ప్రధానమంత్రి కార్యాలయం. ప్రకృతి వ్యవసాయంలో దేశానికి అనంతపురం […]

  • Publish Date - May 14, 2021 / 09:11 AM IST

విధాత(అనంతపురం): మహిళా రైతు వన్నూరమ్మను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రశంసించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(2021 – 22) పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ప్ర‌ధాని మోడీ అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మ తో మాట్లాడారు. మహిళా రైతును, అనంతపురం జిల్లాను మోడీ మెచ్చుకున్నారు.

దేశం మొత్తంలో 5,6 మందితో మాట్లాడితే అందులో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మను ఎంపిక చేసుకున్న ప్రధానమంత్రి కార్యాలయం. ప్రకృతి వ్యవసాయంలో దేశానికి అనంతపురం ఆదర్శం.. వన్నూరమ్మ లాంటి మహిళా రైతులు దేశానికి ఆదర్శం అని అనంతపురం జిల్లాను, వన్నూరమ్మ ను అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

ఒంటరి దళిత మహిళ ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడి మీద నికరం నాలుగు రెట్లు ఆదాయం సంపాదిస్తోంది. అందరూ ఇలాంటి పద్ధతులనే అనుసరిస్తే రాష్ట్రం, దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది అని సూచించిన ప్రధాన మంత్రి. అనంతరం ప్రధాన మంత్రి గారితో మాట్లాడిన మహిళా రైతు వన్నూరమ్మను అభినందించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.

Latest News