విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘104 టెలీకన్సల్టేషన్ ద్వారా కాల్స్ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 5వేల మంది డాక్టర్లు, 900 మంది స్పెషలిస్టులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవుట్ గోయింగ్ కాల్స్ ద్వారా ఐదు లక్షల మందికి పైగా ఇప్పటి వరకూ సేవలందించాం . జూన్ 10 తేదీ వరకూ ఉన్న కర్ఫ్యూను […]
విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘104 టెలీకన్సల్టేషన్ ద్వారా కాల్స్ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 5వేల మంది డాక్టర్లు, 900 మంది స్పెషలిస్టులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవుట్ గోయింగ్ కాల్స్ ద్వారా ఐదు లక్షల మందికి పైగా ఇప్పటి వరకూ సేవలందించాం . జూన్ 10 తేదీ వరకూ ఉన్న కర్ఫ్యూను పొడిగించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు సగటున 10 శాతంగా ఉంది.
తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ క్రమంగా కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోంది. మరికొన్ని జిల్లాల్లో దీన్ని నియంత్రించాల్సి ఉంది. అందుకే 11 తేదీ నుంచి మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ పొడిగించాం . అయితే, సడలింపు సమయంలో కొద్దిగా మార్పులు చేశాము. జూన్ 11 నుంచి 20 తేదీ వరకూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. రాష్ట్రంలో సుమారు 20వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే అందులో 17 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,473 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతోంది’’ అని అనికుమార్ వివరించారు.