విధాత(అమరావతి): జేఎన్టీయూ కాకినాడ వైఎస్ చాన్స్లర్ బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీశ్చంద్రకు అప్పగించింది. ఈమేరకు ఆయన్ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జేఎన్టీయూకేకు వీసీగా ప్రొఫెసర్ ఎం.రామలింగరాజును ప్రభుత్వం ఇటీవల నియమించింది.
ఈ నియామకంపై హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు రావడంతో ప్రభుత్వం నియామకాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను స్పెషల్ సీఎస్ కు అప్పగించింది.