విధాత:ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించామని, షాపింగ్ మాల్స్ ఒపెన్ చేశారు.. ఇక మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామన్నారు. మరి యేసుకు లేని కరోనా గణేశ్కు ఏందుకని ప్రశ్నించారు. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా అని అన్నారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ […]
విధాత:ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించామని, షాపింగ్ మాల్స్ ఒపెన్ చేశారు.. ఇక మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామన్నారు. మరి యేసుకు లేని కరోనా గణేశ్కు ఏందుకని ప్రశ్నించారు. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా అని అన్నారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఏందుకని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.