Site icon vidhaatha

జగన్ మౌనమెందుకు?

విధాత‌: వైకాపా ఎమ్మెల్యేలు కొందరు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే సీఎం జగన్‌ మౌనంగా ఎందుకు ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలోని దేవాలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు జిల్లా వినుకొండలో సోము వీర్రాజు పర్యటించారు. ఓటు బ్యాంకు మత రాజకీయాల నడుమ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆయన విమర్శించారు.

Exit mobile version