మరి కొద్ది గంటలలో గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్లో రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు, సన్నిహితంగా ఉండే కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీల మధ్య ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరగనుంది. రకుల్ పెళ్లికి ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు హాజరు అవుతారని తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, అతడి భార్య తహిరా కష్యప్ , సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా , డేవిడ్ ధావన్ , మంచు లక్ష్మీ, ప్రగ్యా జైస్వాల్, ఆదా శర్మ వంటి ప్రముఖులు రకుల్ పెళ్లిలో తెగ సందడి చేయబోతున్నట్టు సమాచారం. అయితే కొన్ని నెలలుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న రకుల్.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతుండడంతో ఆమెకి సంబంధించిన అనేక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రకుల్, జాకీ పెళ్లి వేడుకల కోసం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా గోవాకు చేరుకుంటున్నారు. సోమవారం రాత్రి హల్దీ వేడుకలు జరిగినట్లు సమాచారం. 2011లోనే తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన రకుల్.. కరోనా లాక్ డౌన్ సమయంలో తమ ప్రేమకథ మొదలైనట్లు చెప్పుకొచ్చింది. అయితే రకుల్, జాకీ ఆస్తులకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. 1990 అక్టోబర్ 10న న్యూ ఢిల్లీలో జన్మించింది రకుల్. ఇక జాకీ 25 డిసెంబర్, 1984న కోల్కతాలో జన్మించాడు. అతను సింధీ కుటుంబానికి చెందినవారు. రకుల్ స్టార్ హీరోయిన్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.
ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న రకుల్ బ్రాండ్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ లలో కూడా బాగానే అందిపుచ్చకుంటుంది. ఇక జూబ్లీహిల్స్ లో 16000 చదరపు అడుగులలో 3BHK ఇంటిని కూడా రకుల్ కలిగి ఉందని టాక్. అలాగే ఢిల్లీ, వైజాగ్, ముంబై ప్రాంతాల్లో కొన్ని ఫ్లాట్స్, జిమ్ ఉన్నాయని సమాచారం. ఇక ఆమె ఖరీదైన కార్లు కూడా కలిగి ఉంది. కోటి విలువ చేసే మెర్సడేజ్ బెంజ్ కారు, రూ. 70 లక్షలు విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ. 75 లక్షలు విలువైన బీఎండబ్ల్యూ 520D, రూ. 35 లక్షలు విలువైన ఆడి క్యూ3. రూ. 2.96 కోట్లు విలువ చేసే కారు రకుల్ కలిగి ఉంది.జాకీ భగ్నానీకి కూడా ఆస్తులు బాగానే ఉన్నట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు సుమారుగా రూ. 84 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారని బాలీవుడ్ టాక్. రకుల్ నికర విలువ రూ. 49 కోట్లు, జాకీ నికర విలువ రూ. 35 కోట్లు ఉందని అంటున్నారు.