Site icon vidhaatha

Changes May 1St | కొత్తగా రూల్స్‌ని తీసుకువచ్చిన బ్యాంకులు..! నేటి నుంచే అమలులోకి..

Changes May 1St | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల గడిచిపోయింది. మే నెల మొదలైంది. ఒకటో తేదీ నుంచి పలు ఆర్థికపరమైన విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బ్యాక్‌తో పాటు పలు బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతా చార్జీలు, క్రెడిట్‌ కార్డుల నిబంధనల్లో మార్పులు చేశాయి. ఆయా మార్పులు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీనియర్‌ సిటిజన్స్‌ స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ఈ నెల 10వతో ముగియనున్నది. ఇక ఈ నెలలో ఆర్థికంగా ప్రభావితం చేసే ఫైనాన్షియల్‌ అప్‌డేట్స్‌ని తెలుసుకుందాం రండి..

సేవింగ్స్ అకౌంట్ సర్వీస్‌ ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంక్‌

ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవల పలు కీలక మార్పులు చేసింది. చెక్‌ బుక్‌ జారీ, ఐఎంపీఎస్‌, ఈసీఎస్‌, ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్‌ కార్డ్‌ రిటర్స్స్‌, స్టాప్ పేమెంట్ ఛార్జీలు సహా వివిధ సేవలకు సర్వీస్ ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది. సవరించిన చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.

హెచ్​డీఎఫ్​సీ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ గడువు పొడిగింపు

సీనియర్ సిటిజన్ల కోసం హెచ్‌డీఎఫ్‌సీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరేందుకు బ్యాంక్‌ గడువును పొడిగించింది. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్​డీ పేరుతో తీసుకువచ్చిన ఈ ప్రత్యేక పథకం అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. 2020 మే నెలలో ప్రారంభించిన ఈ స్కీమ్​లో పెట్టుబడి పెట్టేందుకు నెల 10 వరకు గడువు ఇచ్చింది.

యుటిలిటీ ట్రాన్సాక్షన్ ఫీజు మార్చిన ఐడీఎఫ్‌సీ

యుటిలిటీ ట్రాన్సాక్షన్​ ఫీజును ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ తీసుకొచ్చింది. యుటిలిటీ బిల్లు చెల్లింపులకు సంబంధించి ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు విధానంలో మార్పులు చేయగా.. ఇవి ఒకటో తేదీ అనగా బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ విధానం ప్రకారం స్టేట్‌మెంట్‌ సైకిల్‌ల రూ.20వే కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లులకు క్రెడిట్ కార్డు చెల్లింపులకు జీఎస్​టీతో పాటు ఒకశాతం సర్‌చార్జీ వర్తించనున్నది. అయితే, ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ సెలెక్ట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే లావాదేవీలకు ఈ సర్‌చార్జీ వర్తించదని చెప్పింది.

యెస్ బ్యాంక్

ప్రైవేట్ బ్యాంకు యెస్‌ బ్యాంకు తన పొదుపు ఖాతా ఛార్జీల షెడ్యూ‌ల్‌ని తాజాగా అప్‌డేట్‌చేసింది. అప్‌డేట్స్‌ మే 1 నుంచి అమలులకి రానున్నట్లుగా యెస్ బ్యాంక్ వెబ్​సైట్​లో ఉన్న అధికారిక ప్రకటన తెలిపింది. బ్యాంక్ కొన్ని ఖాతా రకాలను కూడా నిలిపివేసింది. క్రెడిట్ కార్డ్ యుటిలిటీ ట్రాన్సాక్షన్ ఫీజులో నూ మార్పులుచేసింది. ‘ప్రైవేట్’ క్రెడిట్ కార్డ్ రకం మినహా.. మే 1, 2024 నుంచి యెస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులు చేసింది. తాజా అప్డేట్ ప్రకారం, గ్యాస్ చెల్లింపులతో సహా ఒకే స్టేట్‌మెంట్‌ సైకిల్‌లో మొత్తం రూ.15వేల కంటే ఎక్కువ యుటిలిటీ లావాదేవీలు, విద్యుత్, ఇతర సేవలకు జీఎస్​టీతో పాటు ఒకశాతం శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యెస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే లావాదేవీలకు ఈ అదనపు రుసుము వర్తించదని చెప్పింది.

Exit mobile version