స్థిరంగా బంగారం,వెండి ధరలు

ఆదివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,220 వద్ద నిలకడగా ఉండగా..22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,32,200 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,35,000వద్ద స్థిరంగా ఉంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Aug 02, 2026, 10:22 am IST
Read Time: 4 mins
స్థిరంగా బంగారం,వెండి ధరలు

విధాత,హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మార్పులు బంగారం, వెండి ధరలలో అస్థిరతకు కారణమవుతున్నాయి. అయితే ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా నిలిచాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,44,220 వద్ద నిలకడగా ఉండగా..22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,32,200 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,35,000వద్ద స్థిరంగా ఉంది.

ఆగస్టులోనూ అస్థిరత తప్పదు..

అంతర్జాతీయ ఉద్రిక్తతలు,పెరిగిన ముడి చమురు ధరలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం, డాలర్ కదలికలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య పతనమైన పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కూడా అంతకుముందు నెలతో పోల్చితే జూలై నెలలో నెలవారీగా 1% మెరుగుదల నమోదు చేశాయి. వెండి ధరలు 2% పైగా లాభపడ్డాయి. తాత్కాలిక తగ్గుదల ఉన్నప్పటికీ ఆగస్టులో గత ఐదు నెలలతో పోల్చితే తన మొదటి బలమైన నెలవారీ లాభాన్ని నమోదు చేసే దిశగా పయనిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడికి ప్రధాన రక్షణగా నిలిచాయి. అమెరికా, ఇరాన్, ఇరాన్ మద్దతుగల హౌతీ బలగాల మధ్య పెరుగుతున్న ఘర్షణలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్‌ను మళ్లీ పెంచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఎక్కువయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. రాజకీయ అనిశ్చితి కారణంతో హెడ్జింగ్ కోసం ఇన్వెస్టర్లు బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుత వాతావరణంలో మందగించిన ఆర్థిక వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం ఉన్నందున బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుండి 5 శాతం పరిధిలోనే స్థిరంగా ఉంటాయని కౌన్సిల్ భావిస్తోంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడినా లేదా భౌగోళిక ఉద్రిక్తతలు ముదిరినా బంగారం మళ్లీ సరికొత్త రికార్డుల వైపు పయనించవచ్చని పేర్కొంది.