Gold-Silver Rates Hike | సరికొత్త రికార్డులకు పసిడి, వెండి ధరలు.. కిలో లక్ష దాటిన బంగారం..!
Gold-Silver Rates Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో కొనుగోలుదారులు బంగారం అంటేనే బాబోయే అనే పరిస్థితి వచ్చింది. సోమవారం బులియన్ మార్కెట్లో పసిడి ధర మరోసారి భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.500 పెరిగి తులానికి రూ.68,900కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగి తులానికి రూ.75,160కి చేరింది.

Gold-Silver Rates Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో కొనుగోలుదారులు బంగారం అంటేనే బాబోయే అనే పరిస్థితి వచ్చింది. సోమవారం బులియన్ మార్కెట్లో పసిడి ధర మరోసారి భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.500 పెరిగి తులానికి రూ.68,900కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగి తులానికి రూ.75,160కి చేరింది. వెండిపై ఏకంగా రూ.3500 పెరిగి కిలో రూ.96,500 దాటింది. తొలిసారిగా వెండి ధర రికార్డు స్థాయికి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.69వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.75,280కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.68,900 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.75,160కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.69,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.75,310కి పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.68,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.75,160 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది. రూ.3500 వరకు పెరిగి.. ఢిల్లీలో కిలో రూ.96,500కి ఎగిసింది. హైదరాబాద్లో రూ.1,01,000కి చేరింది. వెండి ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.