ఎనభైయవ దశకంలో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన అందాల కథానాయికలలో భానుప్రియ ఒకరు. ఆమె అందం, అభినయానికి ఎవరైన ఫిదా కావల్సిందే. నాలుగు దశాబ్ధాల సినీ కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 155 సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించి మెప్పించింది. సితార, స్వర్ణకమలం, అన్వేషణ, త్రినేత్రుడు వంటి సినిమాల్లో భాను ప్రియ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వర్ణకమలం చిత్రంలో తన నటన, నాట్య ప్రతిభ కనబరిచి ఏకంగా నంది అవార్డ్ కూడా దక్కించుకుంది. హీరోయిన్గా రిటైర్ అయితన తర్వాత భానుప్రియ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆమె చాలా సినిమాలు చేసింది.
అమ్మగా, అక్కగా, పెద్దమ్మగా ఇలా ప్రతి పాత్రలో తన నటనతో మెప్పించింది. అయితే ఇటీవలి కాలంలో మాత్రం భానుప్రియ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మరణించాడని, ఆ తర్వాత తనకు జ్ఞాపక శక్తి తగ్గడం మొదలైనట్లు చెప్పింది. ఈ సమస్య వల్ల సినిమాల్లో డైలాగులు చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొంది. ఓ డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టాలని ఆలోచన చేసిన కూడా ఆరోగ్యం బాగోలేక దానిని విరమించుకున్నట్టు పేర్కొంది. ఇక తాజా ఇంటర్వ్యూలో తాను నటించిన హీరోల గురించి, సినిమాల గురించి చెప్పుకొచ్చింది భానుప్రియ.
మెగాస్టార్ చిరంజీవి గురించి భానుప్రియ పదికి పైగా సినిమాలు చేసింది. అయితే చిరంజీవితో డ్యాన్స్ చేయాలంటే కొందరు హీరోయిన్స్ మాత్రమే చేయగలరు అని పేరు ఉండేది. అందులో భానుప్రియ కూడా ఉంది. ఆమె ఎప్పుడు కూడా చిరంజీవిని కాంపిటీటర్గా భావించేది కాదని, ఆయనతో డ్యాన్స్ చేసేటప్పుడు బాగా చేయాలనే తపన మాత్రమే ఉండేదని పేర్కొంది. చిరంజీవి డాన్స్ మూమెంట్స్, కళ్లు కదిపే విధానం సహా అన్నీ గమనిస్తూ ఉండే భానుప్రియ ఆయనతో కలిసి పాటల్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ రొమాన్స్ ని ఎంజాయ్ చేసేదాన్ని కాదని, రొమాన్స్ చేయలేకపోయేదాన్ని అంటూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిరంజీవి కూడా ఈ విషయాన్ని నాతో చాలా సార్లు చెప్పారని కూడా భానుప్రియ పేర్కొంది. చిరంజీవి చాలా గ్రేట్ డ్యాన్సర్ అని చెప్పిన భానుప్రియ ఆయనని బీట్ చేయడం కష్టమని తెలిపింది. కాకపోతే చిరంజీవితో పోటీగా సినిమాలు చేయాలని ఉందని మాత్రం తెలియజేసింది.