యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వేగం పెంచాడు. పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ అందుకుంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మొదటి పార్ట్ని అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అయితే దేవర చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ భారీ విజువల్స్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్ కారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అక్టోబర్ 10న మాత్రం మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే దానిపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర మూవీ షూటింగ్కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశలో ఉందని, రీసెంట్గా గోవా షెడ్యూల్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారని సమాచారం. ఇప్పుడు సైఫ్ అలీఖాన్తో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
ఏప్రిల్తో మూవీ షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తుండగా, మూడు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయట. జూన్ లోపు ఆ పాటలకి సంబంధించిన కంప్లీట్ షూటింగ్ మొత్తం ఫినిష్ చేసి ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై నిమగ్నమవుతారంట. ఇక త్వరలో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.ఇక క్రేజీ ప్రాజెక్ట్గా రూపొందుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది . ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ ఎత్తున ఈ చిత్రం రూపొందుతుంది.ఈ సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్లో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది.