గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో కుమారి ఆంటీ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. 13 ఏళ్లుగా రోడ్డు పై ఫుడ్ కోర్ట్ నడిపిస్తున్న సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ గత మూడు నెలల కాలంలో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమె దగ్గర ఫుడ్ తినేందుకు జనాలు క్యూ కడుతున్నారు. తన దగ్గరికి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అందిస్తూ ఉండడంతో నిత్యం ఎంతో మంది కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ దగ్గరకు వచ్చి భోజనం చేస్తున్నారు. త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె ఫుడ్ పాయింట్ దగ్గరకు వెళతాడని ఓ ప్రచారం జరిగింది. ఏది ఏమైన కుమారి ఆంటీ పేరు ఇప్పుడు నెట్టింట మారు మ్రోగిపోతుంది.
బిగ్ బాస్ లో కుమారి ఆంటీ సందడి చేయనుందని కొందరు అంటుంటే, మరి కొందరు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొనబోతుందని ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ కూడా రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ప్లిక్స్ లాంటి పాపులర్ సంస్థ కుమారి ఆంటీపై స్పెషల్ డాక్యుమెంటరీ ప్లాన్ చేసిందని, అందులో కుమారి ఆంటీ ఎవరు, ఆమె ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చంది, హోటల్ బిజినెస్ ఎందుకు మొదలు పెట్టాలని అనుకుంది, అంతకముందు ఏం చేసింది వంటి ఆసక్తికర అంశాలని ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. భారీ మొత్తంలో కుమారి ఆంటీకి పారితోషికం ఇచ్చేందుకు కూడా నెట్ ఫ్లిక్స్ వారు సిద్ధంగా ఉన్నట్టు టాక్.
ఇదే నిజమైతే కుమారి ఆంటీ సోషల్ మీడియా..యూట్యూబ్ ఛానల్స్ దాటుకుని.. ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ వరకూ చేరుకుంటుందన్నమాట. రోజురోజుకి కుమారి ఆంటీ క్రేజ్ పెరుగుతుండడం చూసి అందరు షాక్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో కర్రీ అండ్ సైనైడ్ అనే డాక్యుమెంటరీ రూపొందడం, అది బాగా హిట్ కావడం మనం చూశాం. అందుకే నెట్ ఫ్లిక్స్ కుమారి ఆంటీపై కూడా డాక్యుమెంటరీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. నెట్ఫ్లిక్స్ వారు రానున్న రోజులలో ఇలాంటి మరెన్నో డాక్యుమెంటరీలను తీసుకు వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారని ఇన్సైడ్ టాక్.