యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్కి చేరుకుంది. ఇప్పుడు ఆయన సినిమాల కోసం సౌత్లోనే కాదు నార్త్ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కూడా తన అభిమానులని ఏ మాత్రం నిరాశపరచకుండా ఉండే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నాడు.ఈ మూవీతో పాటు వార్ 2 చేస్తున్నాడు. ఇక త్వరలో ఓ బాలీవుడ్ మూవీ అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడని టాక్ నడుస్తుంది. దీనిపై అయితే పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్కి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ ఓ హీరోయిన్ ని ఎంతో ఇష్టపడ్డాడట. బి. గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రంలో ఆయనకి జంటగా సమీరా రెడ్డి నటించింది. మలయాళీ కుట్టి పాత్రలో తన నటనతో అదరగొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో అశోక్ చిత్రంలో రెండోసారి జతకట్టింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఎన్టీఆర్ ఆమెని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు ప్రచారాలు జరిగాయట. అయితే ఈ వార్త హరికృష్ణకి దగ్గరకు చేరడంతో ఆయన చాలా సీరియస్ అయ్యారట. కెరీర్లో ఎదిగే సమయంలో ప్రేమ, దోమలంటూ పిచ్చి పనులు చేయకు అని వార్నింగ్ ఇచ్చారట. అప్పుడు హరికృష్ణ మాటను గౌరవించి సమీరా రెడ్డితో తన బంధానికి ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి.
అయితే ఓసారి సమీరా రెడ్డి కూడా ఎన్టీఆర్ తో ఎఫైర్ రూమర్స్ నన్ను ఇబ్బందిపెట్టాయి. అందుకే నేను టాలీవుడ్ కి దూరం కావల్సి వచ్చింది అని అన్నారు. అతను నాకు మంచి మిత్రుడు మాత్రమే అన్నారు. అయితే వారిద్దిరికి సంబంధించి ఎందుకు అంతలా ప్రచారాలు జరిగాయో తెలియదు. ఇక జూనియర్ 2011లో ఎన్టీఆర్ బంధువుల అమ్మాయి అయిన లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నాడు జూనియర్. ఇక సమీరా రెడ్డి కూడా ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కూడా తన భర్తతో సంతోషంగా ఉంటుంది. నిజంగా సమీరా రెడ్డి-ఎన్టీఆర్ మధ్య ఎఫైర్ నడిచిందా లేదా? అనేది ఎవరికీ తెలియదు. కథనాలు మాత్రం వెలువడ్డాయి.