Kriti Sanon | కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల వరుస సినిమాలతో జోరుమీదున్నది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మూవీతో క్రేజ్ మరింత పెరిగింది. ఈ మూవీలో సీతగా కనిపించగా.. ఈ బూయటీ నటనకు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. కృతి సనన్ నటించిన చిత్రం ‘ది క్రూ’ ఇటీవల విడుదలైంది. లేడి ఓరియంటెడ్ మూవీలో కృతి సనన్తో పాటు టబు, కరీనా కపూర్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే వస్తున్నది. ఇదిలా ఉండగా.. కృతి సనన్ బాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. వాస్తవానికి బాలీవుడ్ ఇండస్ట్రీపై ఎన్నో విమర్శలున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కవగానే మేల్ డామినేషన్ ఉటుందనే ఆరోపణలున్నాయి. హీరోయిన్స్కు కనీస గుర్తింపు ఇవ్వరని పలు ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ వాపోయారు. హీరోలతో సమానంగా తమకూ రెమ్యునరేషన్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి.
తాజాగా కృతి ససన్ సైతం ఇదే అంశంపై స్పందించింది. ‘ది క్రూ’ మూవీ విజయాన్ని చూపిస్తే హీరోలకు చురకలంటించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘ది క్రూ సినిమా ఇంకా బాగు ఆడుతోంది. ఇప్పటికే రూ.100కోట్లు వసూళ్లు దాటింది. ఈ మూవీలో లీడ్ రోల్ చేసింది ముగ్గురు ఆడవాళ్లే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. స్టార్ హీరోలు లేకపోయినా సబ్జెక్ట్ ఉంటే సక్సెస్ అవుతుంది. స్టోరీ బాగుంటే అక్కడ ఉంది ఆడా.. మగా అనే తేడాను అభిమానులు చూపించరు. దురదుష్టవశాత్తు కొందరు దర్శక నిర్మాతలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు అనే భావనలోనే ఉన్నారు. ప్రేక్షకులు ఓ విషయంలో మారాలి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకి తాము పెట్టే టికెట్ డబ్బులు వృథా అనే అభిప్రాయంలో ఉంటారు. ఆ సినిమాలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అంటూ కృతి సనన్ వ్యాఖ్యానించింది. అయితే, కృతి సనన్ దర్శక నిర్మాతలని స్పందించినా పరోక్షంగా బాలీవుడ్ హీరోలపైనే సెటైర్లు వేసిందని కామెంట్స్ చేస్తున్నారు.