Sameera Reddy| టాలీవుడ్ ప్రేక్షకులకి సమీరా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలోనే జన్మించిన సమీరా రెడ్డి మైనే దిల్ తుజ్కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది.ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిం దేశ వ్యాప్తంగా గుర్తిం
Sameera Reddy| టాలీవుడ్ ప్రేక్షకులకి సమీరా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలోనే జన్మించిన సమీరా రెడ్డి మైనే దిల్ తుజ్కో దియా’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది.ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిం దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని ఫుల్ పాపులారిటీని తెచ్చుకుంది. తెలుగులో ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆశోక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ అనే సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇందులో ఆమె అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి. కెరీర్ జోష్లో ఉండగానే 2014లో అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. అయితే సినిమాలకి దూరమైన కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ వార్తలలో నిలుస్తుంటుంది. సమీరా నటిగా ఉన్నప్పుడు తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని, ఆ సమయంలో కొంతమంది తనని ఏకంగా సర్జరీ చేయించుకోవాలని సలహా ఇచ్చినట్లు వెల్లడించింది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్నప్పుడు కొంతమంది బూబ్ జాబ్ సర్జరీ (బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు, మీరు చేయించుకోవచ్చు కదా అంటే నేను సైలెంట్గా ఉండేదాన్ని.
ఒకసారి విసుగెత్తి నేను చేయించుకోను అని అంటే… రివర్స్ లో వాదించి ఒప్పించే ప్రయత్నం చేసేవారు. సర్జరీ చేసుకోమని నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మన చేతిలో లేని కొన్ని ఒత్తిడిలు తప్పవంటూ సమీరా రెడ్డి పేర్కొంది. సర్జరీ విషయంలో నేను ఎవరిని విమర్శించను అని పేర్కొంది. 2015లో బాబు పుట్టిన తర్వాత బరువు పెరిగాను. ‘‘శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్లు నన్ను కామెంట్ చేశారు. చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘మీకు ఏమైంది? ఇది మీరేనా?’ అని అడిగాడు. వాళ్ల విమర్శలు నన్ను ఎంతో భయపెట్టాయి” అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.