Prabhas- Anushka| టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ప్రభాస్, అనుష్క తప్పక ఉంటారు. వీరిద్దరికి స్టార్ స్టేటస్ ఉంది. అయిన కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ప్రభాస్, అనుష్క శెట్టి డేటింగ్ లో ఉన్నారంటూ గత పన్నెండు, పదమూడేళ్లుగా టాలీవుడ్లో వినిపిస్తూనే ఉన్నాయి. 20
Prabhas- Anushka| టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ప్రభాస్, అనుష్క తప్పక ఉంటారు. వీరిద్దరికి స్టార్ స్టేటస్ ఉంది. అయిన కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ప్రభాస్, అనుష్క శెట్టి డేటింగ్ లో ఉన్నారంటూ గత పన్నెండు, పదమూడేళ్లుగా టాలీవుడ్లో వినిపిస్తూనే ఉన్నాయి. 2009లో రిలీజైన బిల్లా సినిమాలో ఫస్ట్ టైమ్ ప్రభాస్, అనుష్క జంటగా నటించగా, ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే ప్రచారం నడిచింది. ఆ తర్వాత మిర్చి, బాహుబలి సమయంలో ఈ ఇద్దరు కలిసి నటించడంతో వారి బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయిందని త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని టాక్ నడిచింది. అయితే ఈ వార్తలని కృష్ణంరాజు కూడా కొట్టి పారేసారు.
ప్రభాస్, అనుష్కలు కూడా పలు సందర్భాలలో ఇవన్నీ రూమర్స్ అని చెప్పారు. అయిన కూడా ప్రభాస్-అనుష్కల పెళ్లికి సంబంధించిన ప్రచారం మాత్రం ఆగడం లేదు.తాజాగా ప్రభాస్, అనుష్కల పెళ్లి రూమర్స్పై శ్యామల దేవి మరోసారి స్పందించారు.ప్రభాస్, అనుష్క పెళ్లి అని వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్సే. ప్రభాస్ నచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే వద్దనేవారు ఎవరు? అంతా తన ఇష్టం. జీవితాన్ని సంతోషంగా పంచుకోవడానికి తను ఎవరినైనా సెలక్ట్ చేసుకోవచ్చు అని పేర్కొంది. ప్రభాస్ మనస్సు చాలా స్వచ్ఛమైనది. వేరే వాళ్ల సంతోషం చూసి తాను సంతోషపడతాడు అని పేర్కొంది శ్యామల దేవి. ఈవిడ మాటలు విన్నాక కొందరు నెటిజన్స్ అనుష్కని ప్రభాస్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.
ఇక కృష్ణంరాజును రెండో పెళ్లి చేసుకోవడం గురించి కూడా శ్యామల స్పందించారు. కృష్ణంరాజుకు సీతాదేవి అనే మహిళతో ముందే పెళ్లయ్యింది. ఆమె చనిపోవడంతో శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నారు. కృష్ణంరాజుకు ఆయన మొదటి భార్య చాలా ఇష్టం. సడెన్గా ఆమె యాక్సిడెంట్లో చనిపోయారు. కృష్ణంరాజు జీవితంలో విషాదం ఏదైనా ఉందంటే అదే. ఆయన పరిస్థితి చూసి తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోమన్నా కూడా చేసుకోలేదు. వేరే దారిలేక కృష్ణంరాజు తండ్రి ఆ వయసులో తిండి మానేశారట. కృష్ణంరాజు పెళ్లికి ఓకే చెప్పేవరకు తిండి తినను అన్నారట. అప్పుడే నాకు కృష్ణంరాజు సంబంధం వచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు శ్యామల దేవి. కృష్ణంరాజుతో రెండో పెళ్లి అంటే మా వాళ్లు ఒప్పుకోలేదు, కాని నేను ఒప్పుకున్నాను. అయితే నాతో బలవంతంగా ఒప్పించారని ఆయన అనుకున్నారు.వేరే వాళ్లని పంపించి అడిగిస్తే నాకు ఇష్టమే అని చెప్పాను అని శ్యామలా దేవి ఆ నాటి పరిస్థితులని గుర్తు చేసుకుంది.