ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు కోసం ఐపీసీ 73 కింద వారెంట్ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు కోసం ఐపీసీ 73 కింద వారెంట్ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నోటీసులో ప్రభాకర్ రావు నాన్ బెయిలబుల్ సెక్షన్లో ప్రధాన అనుమానితుడని కోర్టుకు పోలీసులు తెలిపారు. అతను అరెస్టును తప్పించుకునే ఉద్దేశంతోనే విదేశాలకు వెళ్లిపోయాడని పోలీసులు కోర్టుకు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పని సరిగా మారిందని పోలీసులు కోర్టుకు పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది.
73 వారెంట్కు కోర్టు అనుమతిచ్చిన వెంటనే ప్రభాకర్ రావుకు ప్రభుత్వ అనుమతితో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చి పాస్ పోర్ట్ స్టాంపింగ్ ద్వారా అతను ఉన్న దేశంలోని పోలీసులకు అరెస్ట్ వారెంట్ సమాచారం ఇచ్చి అతనిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకరావాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో పార్ట్-2 మొదలవుతుందని పోలీసులు వర్గాలు చెబుతుండటం ఆసక్తికరం.