ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని కలలు కంటారు. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే ఆశ ఉండకున్నా.. ఏదో ఒక రోజు మాత్రం ధనవంతులం కావాలని కోరుకుంటారు. అందుకు కోసం పడరాని కష్టాలు పడుతుంటారు. ఒంటికి ఏ మాత్రం విశ్రాంతి ఇవ్వకుండా పని చేస్తుంటారు. కానీ కలిసి రాదు. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కనివారు శుక్రవారం రాత్రి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొన్ని పరిహారాలు చేస్తే.. తప్పకుండా ధనవంతులు అవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ పరిహారాలు ఏంటో చూద్దాం.
- ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు, సమయానికి డబ్బులు అందక ఆందోళనకు గురయ్యేవారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి శుక్రవారం రాత్రి అష్టలక్ష్మి ఆరాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు.
- ఇక పూజా చేసే సమయంలో అష్టలక్ష్మి ఆరాధన మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడే చాన్స్ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా, చేస్తున్న పనిలో లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.
- లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. శుక్రవారం రాత్రి పూజ చేసేటప్పుడు ఐం హీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్దయే అనే మంత్రాన్ని జపించండి. ఎర్రని వస్త్రం పరిచి దానిపై లక్ష్మీ దేవి యంత్ర చిత్రపటాన్ని పెట్టి నిష్టగా పూజ చేయండి.
- ఈ మంత్రాన్ని జపించడం వల్ల వ్యాపారం సాఫీగా సాగుతుంది. అలాగే మంచి లాభాలను పొందుతారు. అయితే పూజా సమయంలో ఈ యంత్రానికి అష్టగంధాన్ని పెట్టాలి. అలాగే అమ్మవారు లక్ష్మీదేవికి తిలకం పెట్టడం మర్చిపోకూడదు.
- ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇళ్లు సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ రోజు మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తే కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఆర్థిక సమస్యలనేవే రావటని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు.