Vastu Tips | ఈ నాలుగింటిని మీ ప‌ర్సులో పెట్టుకుంటే చాలు.. ధ‌న‌వంతులుగా మారిపోవ‌డం ఖాయం..!!

Vastu Tips | ఒక వ్య‌క్తి ఆర్థికంగా ఎద‌గాలంటే డ‌బ్బే ప్ర‌ధానం. ఈ డ‌బ్బు స‌రిపోయినంత ఉంటేనే ఆర్థికంగా ఎదిగి ధ‌న‌వంతులుగా మారే అవ‌కాశం ఉంటుంది. ఆర్థికంగా ఎదిగేందుకు వ్యాపారం ప్ర‌ధానం. కొంద‌రికి వ్యాపారం క‌లిసి వ‌స్తుంది. కొంద‌రికి క‌లిసిరాదు. ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా ఆర్థికంగా స్థిర‌ప‌డ‌లేరు. దీనికి కార‌ణం వాస్తు దోష‌మే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

  • Publish Date - June 20, 2024 / 07:17 AM IST

Vastu Tips | ఒక వ్య‌క్తి ఆర్థికంగా ఎద‌గాలంటే డ‌బ్బే ప్ర‌ధానం. ఈ డ‌బ్బు స‌రిపోయినంత ఉంటేనే ఆర్థికంగా ఎదిగి ధ‌న‌వంతులుగా మారే అవ‌కాశం ఉంటుంది. ఆర్థికంగా ఎదిగేందుకు వ్యాపారం ప్ర‌ధానం. కొంద‌రికి వ్యాపారం క‌లిసి వ‌స్తుంది. కొంద‌రికి క‌లిసిరాదు. ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా ఆర్థికంగా స్థిర‌ప‌డ‌లేరు. దీనికి కార‌ణం వాస్తు దోష‌మే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆర్థిక క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారు వారి ప‌ర్సులో ఈ నాలుగు వ‌స్తువుల‌ను ఉంచుకుంటే అదృష్టం త‌న్నుకువ‌స్తుంద‌ట‌. ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి ధ‌న‌వంతులుగా మారుతార‌ట‌. మ‌రి ఆ నాలుగు వ‌స్తువులు ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

గోమ‌తీ చ‌క్రం

హిందూ శాస్త్రం ప్ర‌కారం గోమ‌తీ చ‌క్రం చాలా ప‌విత్ర‌మైన‌ది. ఈ చ‌క్రం ఉన్న చోట ఆర్థిక క‌ష్టాలు ఉండ‌వు. గోమ‌తీ చ‌క్రాలు ఉన్న ఇంట్లో ఎల్ల‌ప్పుడూ ఆనందం, శ్రేయ‌స్సు ఉప్పొంగుతోంది. ఈ చ‌క్రాల వ‌ల్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు విరివిగా ఉంటాయి. ఇంట్లో సానుకూల శ‌క్తిని ప్ర‌స‌రిస్తుంది. కాబ‌ట్టి మీ ప‌ర్సులో కూడా గోమ‌తీ చ‌క్రాన్ని ఉంచుకుంటే ఆర్థిక క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కిన‌ట్లే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

రావి చెట్టు ఆకులు

హిందూ సంప్ర‌దాయంలో రావి చెట్టును ఎంతో ప‌విత్రంగా చూస్తారు. పూజిస్తారు కూడా. ప్ర‌తి ఆల‌యంలో రావిచెట్టు ఉంటుంది. ఇక గుడికి వెళ్లిన ప్ర‌తి ఒక్క‌రూ కూడా రావి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. ముడుపులు క‌ట్టి త‌మ కోరిక‌ల‌ను కోరుకుంటారు. మ‌రి ఇంత ప‌విత్ర‌మైన రావిచెట్టు ఆకుల‌ను మీ ప‌ర్సులో ఉంచుకుంటే ఆర్థిక ప‌రిస్థితి త‌ప్ప‌కుండా మెరుగుప‌డుతుంది. ప‌ర్సు పైస‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని, అలాగే జీవితంలో విజ‌యం వ‌రిస్తుంద‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

బియ్యం గింజ‌లు

ఆర్థిక సమస్యలు తీరిపోయి.. మీరు ధనవంతులు కావాలంటే మీ పర్సులో బియ్యం ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది మీ అదనపు ఖర్చులను తగ్గిస్తుందని.. సంపద పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.

కమలం పువ్వు

క‌మ‌లం పువ్వుల‌కు లక్ష్మీదేవితో ప్రత్యేక సంబంధం ఉంది. అందువల్ల మీ పర్సులో తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ఫొటోను త‌ప్ప‌క ఉంచుకోవాలి. ఈ ఫొటో చాలా శుభప్రదమని.. ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. అలాగే.. జీవితంలో విజ‌యావ‌కాశాలు అందుకుంటామ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Latest News