UGC New Guidelines | సాధారణంగా ఏదైనా అంశంపై పీహెచ్డీ చేయాలంటే పీజీ స్థాయిలో సంబంధిత అంశానికి సంబంధించిన సబ్జెక్టు చదవి ఉండాలి. కానీ ఇకపై పీజీతో సంబంధం లేకుండా పీహెచ్డీ చేయొచ్చు. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాయొచ్చని, తద్వారా వారు పీహెచ్డీలో ప్రవేశం పొందవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తెలిపింది.
UGC Guidelines : సాధారణంగా ఏదైనా అంశంపై పీహెచ్డీ చేయాలంటే పీజీ స్థాయిలో సంబంధిత అంశానికి సంబంధించిన సబ్జెక్టు చదవి ఉండాలి. కానీ ఇకపై పీజీతో సంబంధం లేకుండా పీహెచ్డీ చేయొచ్చు. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాయొచ్చని, తద్వారా వారు పీహెచ్డీలో ప్రవేశం పొందవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తెలిపింది.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఉన్నా లేకపోయినా పీహెచ్డీ చేసేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉంటే చాలని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పష్టంచేశారు. ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులు/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి మాత్రం మార్కుల్లో 5 శాతం సడలింపు ఉంటుందని తెలిపారు.
ఇప్పటివరకు 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే నెట్ పరీక్ష రాసేందుకు అర్హత ఉండేదని, యూజీసీ తాజా నిర్ణయంతో ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినవాళ్లు నేరుగా యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష రాసి పీహెచ్డీలో ప్రవేశం పొందేందుకు అర్హులుగా నిర్ణయించామని యూజీసీ ఛైర్మన్ వెల్లడించారు.
నాలుగేళ్ల డిగ్రీ చేసిన అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్డీ చేయవచ్చని యూజీసీ ఛైర్మన్ చెప్పారు. యూజీసీ నెట్ సెషన్ పరీక్షలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా యూజీసీ నెట్ (జూన్) సెషన్కు సంబంధించి ఏప్రిల్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 10వ తేదీలోగా ugcnet.nta.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 12వ తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలి.