“వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటించిన 'వెంకట్రామయ్య గారి తాలూకా' చిత్రం జూలైలో విడుదల కానుంది. కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది.

సతీష్ ఆవాల దర్శకత్వం లో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల కానుంది.

దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో సతీష్ ఆవాల దర్శకత్వం లో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా” ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాత, సింగర్ కోమలి మాట్లాడుతూ…ఫోక్ సింగర్ గా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టంతో నేను సినిమా తీయాలి అని ఒక ధ్యేయంతో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని
“వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రాన్ని పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మొదలయినప్పటి నుండి ఇప్పటివరకు నేను పడిన కష్టం పడిన మాటలు కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు అన్ని కష్టాలు ఎదుర్కుని జులై లో మూవీ విడుదల చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని వెల్లడించారు. మా సినిమాకి మీడియా సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను అని కోమలి తెలిపారు.

దర్శకుడు సతీష్ అవాల మాట్లాడుతూ.. “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రం జూలై నెలలో విడుదల చేస్తామని, త్వరలోనే డేట్ ఫైనల్ చేసి ఆపిషియల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం అని చెప్పారు.

చిత్ర కథ :

కథ విషయానికోస్తే అందమైన ఒక పల్లెటూరు లో వెంకట్రమయ్య అనే పరువుగల కుటుంబం లోజరిగే ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బు తో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు గా మారిపోయాయి. తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దగా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. కానీ తల్లి తల్లిదండ్రుల చివరి దశలో నలుగురు పిల్లలు కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లి తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా. “వెంకట్రామయ్య గారి తాలూకా” మంచి ఫ్యామిలీ డ్రామాని కుటుంబం తో కలిసి థియేటర్ కి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసేలా చిత్రాన్ని తెరకేకించాం అని దర్శకుడు సతీష్ ఆవాల తెలిపారు.

తారాగణం: దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్,మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని,యామిని తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్: కోమలి క్రియేషన్స్
కొరియోగ్రాఫర్: సాగర్ మాస్టర్
మ్యూజిక్ డైరెక్టర్: చరణ్ అర్జున్
కెమెరామెన్: బి. అనిల్ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.
పి. ఆర్. ఓ: కడలి రాంబాబు
నిర్మాతలు: కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: సతీష్ ఆవాల

Latest News