Telangana Global Summit : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న దక్షిణాసియా రాయబారులు నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని సందర్శించి అద్భుత నిర్మాణం, బౌద్ధ వారసత్వపు వైభవం చూసి ప్రశంసలు కురిపించారు.

Telangana Global Summit

విధాత : హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన దక్షిణాసియా దేశాల రాయబారులు సోమవారం నాగార్జునసాగర్ లోని బుద్ధవనం వారసత్వ థీమ్ పార్క్ ను సందర్శించారు. మలేషియా హై కమిషనర్ ముజఫర్ షాబిన్ ముస్తఫా, నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ, భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్ సోప్ నాంగ్వెల్, థాయిలాండ్ రాయబారి చావనార్ట్ తంగ్ సుపంత్, ఆమె కార్యదర్శి రుచీ సింగ్ లు బుద్ధ వనాని సందర్శించారు.

ఈ సందర్భంగా బుద్ధవనం ఎంట్రన్స్ ప్లాజా వద్ద వారికి తెలంగాణ సాంప్రదాయ ప్రకారం కోలాటం డప్పుల నృత్యాల మధ్య బుద్ధ వనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతం పలికారు. బుద్దవనం బౌద్ధ శాలువాలతో పుష్పగుచాలతో వారిని స్వాగతించారు. నంతరం రాయబార్ల బృందం బుద్ధ చరిత వనంలోని బుద్ధ పాదాల వద్ద, మహా స్తూపం లోని ఆచార్య నాగార్జున విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించారు. బుద్ధ వనంలో నిర్మాణంలో ఉన్న బుద్దిస్ట్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ మ్యూజియాన్ని, తెలంగాణలో బౌద్ధ వారసత్వం పై వీడియోలను వారు వీక్షించారు. బుద్ధవనం ప్రత్యేకతల గురించి ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో బౌద్ధ విషయ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు.

మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార సంచాలకులు బుద్ధ పాల ప్రత్యేక బౌద్ధ ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం బుద్ధవనం సందర్శించిన రాయబారులను ఆశీర్వదించారు.

బుద్దవనం నిర్మాణం అద్బుతం

బుద్ధవనంలోని వివిధ విభాగాలను సందర్శించిన రాయబారులు బుద్దవనం నిర్మాణం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ఇంత పెద్ద మహాస్థూపాన్ని, దాని చుట్టూ ఉన్న వేలాది శిల్పాలను, స్థూపాల నమూనాలను శ్రీలంక బుద్ధుని శిల్పాన్ని, జాతక కధ శిల్పాలను ఒక్కచోట చూడడం గొప్ప విషయమని పేర్కొన్నారు.1700 సంవత్సరాల తర్వాత అమరావతి శిల్పకలకు మళ్లీ ప్రాణం పోశారని కొనియాడారు. మహా స్తూపం అంతర్భాగంలోని అలంకరణ తమ ఎంతో ఆకట్టుకుందన్నారు. అనంతరం విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వారికి తెలంగాణ టూరిజం హోటల్స్ జీఎం నాథన్, ఏజీఎం జంగయ్య రాయబార్ల బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.

సాగర్ జలాశయంలో విహారం

బుద్దవనం సందర్శన తర్వాత సుందరంగా అలంకరించిన తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునసాగర్ జలాశయంలో దక్షిణాసియా రాయబారులు విహరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన,, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర బుద్దవనం ఆర్ట్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యామసుందర్రావు, లాంచీ యూనిట్ మేనేజర్ హరి, విజయ విహార్ మేనేజర్ కిరణ్, స్థానిక సీఐ శ్రీను నాయక్, ఎస్ఐ ముత్తయ్య,, పెద్దవూర ఎస్సై ప్రసాద్ నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ వేణు, రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

Droneshwar Mahadev : అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం
Jishnu Dev Varma : త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం

Latest News