Benjamin Netanyahu | గాజాలోని హమాస్ మిలిటెంట్ గ్రూప్తో యుద్ధాన్ని అపేదేలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టంచేశారు. ఆదివారం జెరూసలెంలో ఆయన తన వీక్లీ క్యాబినెట్ మీటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి వస్తున్న ఆయుధాలపై చర్చ జరిగింది. ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేస్తోందని బెంజమిన్ నెతన్యాహు సమావేశంలో వెల్లడించారు.
Benjamin Netanyahu : గాజాలోని హమాస్ మిలిటెంట్ గ్రూప్తో యుద్ధాన్ని అపేదేలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టంచేశారు. ఆదివారం జెరూసలెంలో ఆయన తన వీక్లీ క్యాబినెట్ మీటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి వస్తున్న ఆయుధాలపై చర్చ జరిగింది. ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేస్తోందని బెంజమిన్ నెతన్యాహు సమావేశంలో వెల్లడించారు. సమావేశం ప్రారంభంలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘నాలుగు నెలల నుంచి అమెరికా నుంచి ఇజ్రాయెల్కు వచ్చే ఆయుధాలు తగ్గాయి’ అన్నారు.
‘చాలా వారాలుగా రవాణాను వేగవంతం చేయమని మా అమెరికన్ స్నేహితులను అభ్యర్థించాము. మేం దీన్ని అత్యున్నత స్థాయిలో చేశాం. అమెరికా నుంచి మాకు అన్ని రకాల క్లారిటీలు వచ్చాయి. కానీ ఇంకా అవసరమైనవి రాలేదు. కొన్ని వస్తువులు వచ్చినా పెద్ద ఎత్తున ఆయుధాల సరఫరా నిలిచిపోయింది.’ అని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే అమెరికా వద్ద ఉన్న ఆయుధాలేమిటో నెతన్యాహు చెప్పలేదు. నెతన్యాహు ఇంకా మాట్లాడుతూ.. ‘రఫాలో వినియోగిస్తామనే భయంతోనే అమెరికా ఆయుధాల రవాణాలో జాప్యం చేస్తోంది.’ అని వ్యాఖ్యానించారు.
గాజా, లెబనాన్, ఇరాన్ బెదిరింపుల గురించి సీనియర్ యూఎస్ అధికారులతో చర్చించడానికి రక్షణ మంత్రి యువావ్ గలన్ట్ (Yoav Galant) శనివారం రాత్రి వాషింగ్టన్కు బయలుదేరిన తర్వాత నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నెతన్యాహు జూలై 24న కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కూడా ప్రసంగించనున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో నెతన్యాహు మేజర్-జనరల్ నియామకాలను కూడా ప్రకటించారు. ఇజ్రాయెల్, గాజా మధ్య చాలాకాలంగా ఉద్రిక్తత కొనసాగుతోంది.
2023 అక్టోబర్ 7న, గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై హమాస్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 1,200 మంది మరణించారు. 252 మంది ఇజ్రాయిలీలు, విదేశీయులను బందీలుగా తీసుకున్నారు. 116 మంది బందీల్లో 30 మందికిపైగా మరణించారు. నాటి నుంచి హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. కానీ ఈ యుద్ధంలో ఎంతో మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.