Singapore | సింగపూర్ వామ్ ఆధ్వర్యంలో వాసవి జయంతి వేడుకలు

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్‌లో విభాగం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

  • Publish Date - May 21, 2024 / 09:02 AM IST

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్‌లో విభాగం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి సందర్భంగా పూజ కార్యక్రమాలు జరుపుతామని ఈ సందర్భంగా సింగపూర్ విభాగం ఉత్సవాలను అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త తెలిపారు. దాతలు అందించిన స్వచ్ఛంద విరాళాలతో నంగునూరి వెంకట రమణ, సంకా వెంకట రవికుమార్‌, ఉద్దగిరి సతీశ్‌ ఆధ్వర్యంలో స్థానికంగా సెంగ్కాంగ్ లోని మరుగన్‌ జ్ఞాన మునీశ్వర్‌ ఆలయంలో ఉదయం గం||10:30 లకు మొదలు పెట్టి అర్చన, పూజ తదనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలతో మధ్యాహ్నం గం|| 12:30 లకు ముగించారు.

వామ్‌ మహిళా విభాగం ప్రతినిధులుగా దీప భాస్కర్, వసుధ సతీష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వామ్ సింగపూర్ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సమస్త మానవాళికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంచర్ల శరత్ బాబు, కోట సతీశ్‌, కంకిపాటి శశిధర్ లతో పాటు నూతన కమిటీ సభ్యులు కొణిజేటి రవి కుమార్, ఓరుగంటి భాను ప్రసాద్, ఆలపాటి వెంకట రాఘవరావు, కాల్వ లక్ష్మణరాజు, కోట సుబ్బారావు, గాదంశెట్టి ఫణిక్రిష్ణ మరియు ఇతర సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసారు.

Latest News