న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌Uttar Pradeshలోని లక్నో(Lucknow)లో బాణసంచా ఫ్యాక్టరీ(firecracker factory)లో చోటు చేసుకున్న భారీ పేలుడు (explosion) ఘటనలో ఇద్దరు మృతి(Two Persons Dead)చెందారు. పలువురు గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఫ్యాక్టరీ యజమాని ఆలం కూడా ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల్ని అదుపు చేయడానికి.. అరడజను అగ్నిమాపక వాహనాల మోహరించారు.